వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు గుంటూరు బయలుదేరిన సందర్భంగా పోలీసులు ఆయనను అడ్డుకున్నారు. ఆయన వాహనం వెనుక మూడుకు మించి వాహనాలు ఉండకూడదనే నిబంధనను పోలీసులు చూపించడంతో, ఆయన కాన్వాయ్లోని పలు వాహనాలను నిలిపివేశారు. దీనిపై అంబటి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
రాజమండ్రి నుంచి గుంటూరుకు బయలుదేరిన అంబటి రాంబాబును పోలీసులు అడ్డుకున్నారు. ఆయన వాహనం వెనుక మూడు వాహనాలకు మించి ఉండకూడదని పోలీసులు నిబంధన విధించారు. ఈ క్రమంలో అంబటి వాహనం బయలుదేరిన వెంటనే, ఆయన కాన్వాయ్లో వస్తున్న పలు వాహనాలను పోలీసులు నిలిపివేశారు. దీనిపై జక్కంపూడి రాజా, ఇతర వైఎస్సార్సీపీ నేతలు ఆందోళనకు దిగారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పోలీసుల తీరుపై అంబటి రాంబాబు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. తన వాహనం వెనుక వచ్చే వాహనాలను అడ్డుకుంటే, కారులో కాకుండా పాదయాత్రగా గుంటూరుకు వెళ్తానని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం తీరు దారుణంగా ఉందని, 18 రోజుల రిమాండ్ అనంతరం శాంతియుతంగా వెళుతున్న వారిపై ఇలాంటి దాష్టీకం చేయడం సరికాదని ఆయన విమర్శించారు.










