రాజంపేటలో పింఛన్ దరఖాస్తుదారులకు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాల జారీలో జరుగుతున్న జాప్యంపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు స్పందించారు. గురువారం ఆయన రాజంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేసి, అధికారులతో మాట్లాడారు.
వృద్ధులు, వికలాంగులు, వితంతువుల కళ్ళలో ఆనందం చూడడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని, రాష్ట్ర ప్రభుత్వం నూతనంగా విడుదల చేసిన ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛన్లలో అర్హులైన ఏ ఒక్కరికి అన్యాయం జరగకూడదని చమర్తి జగన్ మోహన్ రాజు స్పష్టం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పింఛన్లకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు పొందడంలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్న విషయం బుధవారం సామాజిక మాధ్యమాలలో వైరల్ అయ్యింది. దీనిపై వెంటనే స్పందించిన చమర్తి జగన్ మోహన్ రాజు గురువారం రాజంపేట తహసీల్దార్ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు.











