Suryapet/Nadigudem (డాక్సిన్ టైమ్స్) జూన్ 30
ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో భూమా అఖిలప్రియ 'మన భూమా – మన ధీమా' అనే ప్రత్యేక కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వారానికి మూడు రోజులు ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు పర్యటిస్తానని ఆమె తెలిపారు.
"మన భూమా – మన ధీమా" అనే ప్రత్యేక కార్యక్రమాన్ని భూమా అఖిలప్రియ ప్రారంభించారు. తమ ఆళ్లగడ్డ నియోజకవర్గ ప్రజల సమస్యలను క్షేత్రస్థాయిలోనే తెలుసుకుని, తక్షణమే పరిష్కరించే లక్ష్యంతో ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టినట్లు ఆమె తెలిపారు. ఇందులో భాగంగా ఇకపై వారానికి 3 రోజులు స్వయంగా వార్డులు, గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజల ఇంటి వద్దకే వచ్చి సమస్యలను అడిగి తెలుసుకుంటానని ఆమె చెప్పారు.
ఈ సందర్భంగా ఆళ్లగడ్డ పట్టణంలోని కోయిలకుంట్ల రోడ్డు (159 బూత్) పరిధిలో నడుచుకుంటూ పర్యటించి, డ్రైనేజీ, రోడ్ల దుస్థితిని ఆమె స్వయంగా పరిశీలించారు. గతంలో తాను మంత్రిగా ఉన్నప్పుడు ఇక్కడ డ్రైనేజీల కోసం రూ.30 లక్షలు మంజూరు చేసినప్పటికీ, గత వైసీపీ ప్రభుత్వం ఆ పనులను రద్దు చేసి ప్రజలను ఇబ్బందులకు గురిచేసిందని ఆమె విమర్శించారు.
ఈ లోపభూయిష్టమైన డ్రైనేజీ వ్యవస్థకు స్వస్తి పలికి, అక్రమ కట్టడాలను తొలగించి, శాస్త్రీయంగా కొత్త కాల్వలను నిర్మిస్తామని భూమా అఖిలప్రియ హామీ ఇచ్చారు. ముఖ్యమంత్రితో, మంత్రి నారాయణతో మాట్లాడి అవసరమైన నిధులు తీసుకువచ్చి, రాబోయే 4 నుండి 5 నెలల్లో ఇక్కడి డ్రైనేజీ సమస్యకు శాశ్వత పరిష్కారం చూపిస్తానని ఆమె స్పష్టం చేశారు. సోషల్ మీడియా ద్వారా గానీ, నేరుగా గానీ దృష్టికి తీసుకువచ్చే ప్రతి సమస్యను పరిష్కరించి, ఆళ్లగడ్డను ప్రగతిపథంలో నడిపించడమే తన ధ్యేయమని ఆమె తెలిపారు.











