తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర భక్తి ఛానల్ (SVBC) ఏర్పాటుపై అప్పటి ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశారు. ఈ ఛానల్ స్థాపనకు 42 కోట్ల రూపాయలు వెచ్చించడం అనవసరమని ఆయన అభిప్రాయపడ్డారు.
జూలై 7, 2008న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వై.ఎస్. రాజశేఖర్ రెడ్డి శ్రీవారి భక్తుల కోసం SVBCని ప్రారంభించారు. స్వామివారి సేవలను ప్రపంచవ్యాప్తంగా ఉన్న భక్తులకు నేరుగా అందించడం ఈ ఛానల్ ముఖ్య ఉద్దేశ్యంగా ప్రకటించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అయితే, ఈ ఛానల్ ఏర్పాటును చంద్రబాబు నాయుడు తీవ్రంగా వ్యతిరేకించారు. అసెంబ్లీలో మాట్లాడుతూ, 'భక్తి ఛానల్ ఏర్పాటు అవసరమా?' అని ఆయన ప్రశ్నించారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల కోసం ఇంత పెద్ద మొత్తంలో నిధులను కేటాయించడాన్ని ఆయన ఆనాడు నిధుల దుర్వినియోగంగా అభివర్ణించారు.










