జమ్మూ కశ్మీర్లోని ఎత్తైన ప్రాంతాల్లో మంచు కురవడం ప్రారంభమైంది. జిల్లాలోని గురేజ్, తులైల్ లోయలతో పాటు కాబుల్ గలి ప్రాంతంలో తాజాగా మంచు కురిసింది. దీంతో అక్కడి పర్వతాలు, రహదారులు, పరిసర ప్రాంతాలు తెల్లని మంచు దుప్పటితో కప్పబడిపోయాయి. ఈ అందమైన దృశ్యాలకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.
హిమాలయ పర్వత ప్రాంతాల్లో ఉన్న గురేజ్ లోయ సముద్ర మట్టానికి సుమారు 2,400 మీటర్ల ఎత్తులో ఉంది. చుట్టూ మంచుతో కప్పబడిన పర్వతాలు, మధ్యలో ప్రవహించే కిషన్గంగా నది ఈ ప్రాంతానికి ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తున్నాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
తులైల్ లోయ కూడా గురేజ్ ప్రాంతంలోని ఎత్తైన హిమాలయ ప్రాంతాల్లో ఒకటిగా ఉంది. ఇక్కడ చలికాలంలో భారీగా మంచు కురిసే అవకాశం ఉంది. తాజా మంచుతో ఈ ప్రాంతం మరింత అందంగా కనిపిస్తోంది.











