ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులు అరవింద్ కేజ్రీవాల్, మనీష్ సిసోడియా సహా 23 మందిని కేసు నుండి విముక్తి (డిశ్చార్జ్) చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు సంచలన తీర్పు వెలువరించింది. నిందితులకు వ్యతిరేకంగా బలమైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది.
ఢిల్లీ మద్యం పాలసీ కేసులో ఆమ్ ఆద్మీ పార్టీ (AAP) నాయకులకు ఊరట లభించింది. మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియాతో సహా మొత్తం 23 మందిని ఈ కేసు నుండి విముక్తి (డిశ్చార్జ్) చేస్తూ ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు చారిత్రాత్మక తీర్పు వెలువరించింది. 2021-22లో ప్రవేశపెట్టిన ఎక్సైజ్ పాలసీలో అవినీతి జరిగిందని, ప్రభుత్వ ఖజానాకు నష్టం వాటిల్లిందని CBI, ED కేసులు నమోదు చేశాయి.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
స్పెషల్ జడ్జి జితేంద్ర సింగ్ నేడు వెలువరించిన తీర్పులో CBI వాదనలను కోర్టు తోసిపుచ్చింది. నిందితులకు వ్యతిరేకంగా ఎటువంటి "బలమైన ఆధారాలు" లేవని, కేవలం ఊహాగానాల ఆధారంగా కుట్ర కోణాన్ని సృష్టించలేమని కోర్టు స్పష్టం చేసింది. CBI దాఖలు చేసిన ఛార్జిషీట్లో పొంతన లేదని, సాక్షుల వాంగ్మూలాలకు, సాక్ష్యాలకు మధ్య సంబంధం లేదని కోర్టు అభిప్రాయపడింది.









