దేశంలోని చట్టసభల్లో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించే దిశగా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ప్రతిపాదనను నియోజకవర్గాల పునర్విభజన కంటే ముందే అమలులోకి తీసుకురావాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లు సమాచారం.
ఈ మేరకు రాజ్యాంగ సవరణ బిల్లును త్వరలో పార్లమెంట్లో ప్రవేశపెట్టే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. ఈ చట్టం అమల్లోకి వస్తే, దేశవ్యాప్తంగా మహిళా ప్రాతినిధ్యం గణనీయంగా పెరిగే అవకాశం ఉంది.
తెలంగాణ రాష్ట్రంలో ఈ చట్టం అమలైతే, ప్రస్తుతం ఉన్న 119 అసెంబ్లీ స్థానాల్లో సుమారు 40 సీట్లు మహిళలకు కేటాయించబడతాయి. ఇది రాష్ట్ర రాజకీయాల్లో మహిళల భాగస్వామ్యాన్ని పెంచేందుకు దోహదపడుతుంది.










