నీట్, యూజీసీ-నెట్ వంటి కీలక పరీక్షల నిర్వహణలో ఎదురైన వివాదాలు, ప్రశ్నపత్రాల విషయంలో తలెత్తిన లోపాల నేపథ్యంలో జాతీయ పరీక్షల సంస్థ కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది. దాదాపు 600 మంది సబ్జెక్ట్ నిపుణులను తొలగించిన అనంతరం, కొత్త నిపుణుల బృందాన్ని ఏర్పాటు చేసేందుకు నాలుగు దశల కఠిన పరిశీలన విధానాన్ని తీసుకురానుంది.
కొత్తగా నిపుణులుగా ఎంపిక కావాలనుకునే విద్యావేత్తలు ముందుగా తమ విద్యార్హతలు, అనుభవం, ఉద్యోగ వివరాలు, సంబంధిత ధ్రువపత్రాలను సమర్పించాల్సి ఉంటుంది. అవసరమైన చోట ప్రస్తుత సంస్థ నుంచి అనుమతి పత్రాన్ని కూడా ఇవ్వాలి. అలాగే గోప్యత, ప్రయోజనాల సంఘర్షణకు సంబంధించిన ప్రకటనలు తప్పనిసరి చేయనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
నాలుగు దశల్లో పరిశీలన
మొదటి దశలో అభ్యర్థుల దరఖాస్తులు, విద్యార్హతలు, అనుభవం, గుర్తింపు పత్రాలు, ఇతర ధ్రువపత్రాలను పరిశీలిస్తారు. రెండో దశలో అభ్యర్థికి నిజంగా సంబంధిత సబ్జెక్టుపై ఎంత నైపుణ్యం ఉందో ప్రత్యేక నిపుణుల కమిటీ అంచనా వేస్తుంది. వారి విద్యా ప్రస్థానం, పరిశోధన, గతంలో ప్రశ్నపత్రాల తయారీలో అనుభవం వంటి అంశాలను పరిశీలిస్తారు.











