మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి రేపు నెల్లూరులో పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా ఆయన స్కిల్ డెవలప్మెంట్ మాజీ ఛైర్మన్ కొండూరు అజత్రెడ్డి కుమారుడి వివాహ వేడుకల్లో పాల్గొంటారు.
గురువారం ఉదయం 8.45 గంటలకు వైఎస్ జగన్ కడపలోని తన నివాసం నుంచి బయలుదేరి, 9 గంటలకు హెలికాప్టర్లో నెల్లూరుకు ప్రయాణమవుతారు.
ఉదయం 10 గంటలకు నెల్లూరు చేరుకున్న అనంతరం, 10.10 గంటలకు రోడ్డు మార్గంలో వీపీఆర్ కన్వెన్షన్ సెంటర్కు చేరుకుంటారు.
ఈ కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత ఆయన తిరిగి పయనమవుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. ఈ పర్యటన రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది.










