తెలంగాణ రాష్ట్రంలో మరో విమానాశ్రయం ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కు ఆమోదం లభించడంతో, త్వరలోనే భూసేకరణ పనులు ప్రారంభం కానున్నాయి. ఈ ప్రాజెక్టుతో జిల్లా పారిశ్రామికాభివృద్ధికి ఊతం లభించనుంది.
తెలంగాణలో విమానయాన సౌకర్యాలను విస్తరించే దిశగా కేంద్ర ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఇప్పటికే వరంగల్ మామునూరు ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అనుమతులు లభించి, భూసేకరణ పనులు జరుగుతుండగా, తాజాగా ఆదిలాబాద్ ఎయిర్పోర్ట్ మాస్టర్ ప్లాన్కు కేంద్రం ఆమోదం తెలిపింది. ఈ మేరకు స్థానిక ఎంపీ గోడం నరేష్ మాస్టర్ ప్లాన్ను విడుదల చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ప్రస్తుతం రాష్ట్రంలో హైదరాబాద్లోని శంషాబాద్ విమానాశ్రయం మాత్రమే ప్రయాణికుల సేవలో ఉంది. వరంగల్, కొత్తగూడెం, రామగుండం ఎయిర్పోర్ట్లకు అనుమతులు రాగా, ఇప్పుడు ఆదిలాబాద్లోనూ విమానాశ్రయం ఏర్పాటు కానుంది. ఇది జిల్లా పారిశ్రామికాభివృద్ధికి, ప్రజల రాకపోకలకు ఎంతగానో దోహదపడుతుందని భావిస్తున్నారు.












