తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ సెక్యూరిటీ విభాగం (ఎస్ఐబీ) ఎదుట మావోయిస్టు పార్టీకి చెందిన ఇద్దరు కీలక నాయకులు లొంగిపోయారు. ఈ పరిణామం మావోయిస్టు కార్యకలాపాలపై తీవ్ర ప్రభావాన్ని చూపే అవకాశం ఉందని భావిస్తున్నారు.
లొంగిపోయిన వారిలో కేంద్ర మావోయిస్టు పార్టీ సెక్రెటరీగా ఉన్న దేవ్ జీ, మావోయిస్టు పొలిట్ బ్యూరో సభ్యుడిగా ఉన్న మల్లా రాజిరెడ్డి ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇరువర్గాల మధ్య జరిగిన సంప్రదింపుల అనంతరం ఈ లొంగుబాటు జరిగినట్లు తెలుస్తోంది. అయితే, దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇంకా వెల్లడి కాలేదు.












