కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లాలో ఒక ఆవు తన దూడపై పులి దాడి చేసిన సంఘటనలో, మృతదేహం ఉన్న ప్రదేశాన్ని అటవీ అధికారులకు చూపించి తల్లి ప్రేమను చాటుకుంది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర చర్చనీయాంశమైంది.
ఇటిక్యాలపహాడ్లో ఆదివారం మేత కోసం అడవిలోకి వెళ్లిన ఆవుల మందపై పులి దాడి చేసింది. ఈ దాడిలో ఒక లేగ దూడ మృతి చెందింది. పులి దాడి నుంచి తప్పించుకున్న ఆవు, భయంతో ఇంటికి చేరుకుంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
దూడ ఇంటికి రాకపోవడంతో ఆందోళన చెందిన యజమాని, ఆవును అనుసరించి అడవిలోకి వెళ్ళాడు. అక్కడ దూడ మృతదేహాన్ని చూసిన యజమాని, వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాడు.












