పశ్చిమ గోదావరి జిల్లా కలెక్టర్ నాగమణి, తన కుటుంబంతో కలిసి శ్రీకాళహస్తీశ్వర దేవస్థానంలో శ్రీకాళహస్తీశ్వర స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయ అధికారులు ఆమెకు ఘనస్వాగతం పలికి, ప్రత్యేక దర్శన ఏర్పాట్లు చేశారు.
శుక్రవారం ఉదయం ఆలయానికి చేరుకున్న కలెక్టర్ నాగమణిని ఆలయ ఈవో బీకే వెంకటేశులు, ఏఈఓ విద్యాసాగర్ రెడ్డి, ప్రోటోకాల్ ఏఈఓ మోహన్, ఏపీఆర్ఓ రవి తదితరులు ఆహ్వానించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఆలయ అధికారులు కలెక్టర్కు అంతరాలయ దర్శనం కల్పించి, వేద పండితులచే వేద ఆశీర్వచనం చేయించారు. స్వామివారి తీర్థప్రసాదాలను అందజేశారు.










