అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తదుపరి చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్పై సైనిక దాడులు లేదా దౌత్యపరమైన మార్గంపై తాను ఆలోచిస్తున్నట్లు ఆయన వెల్లడించారు. ఇదే సమయంలో హార్ముజ్ జలసంధిలో చమురు ట్యాంకర్పై దాడి జరిగినట్లు ఇరాన్ ప్రకటించింది.
అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఇరాన్పై తదుపరి చర్యల విషయంలో కీలక నిర్ణయం తీసుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఇరాన్పై మరోసారి భారీ స్థాయిలో సైనిక దాడులు చేపట్టాలా లేక దౌత్యపరమైన మార్గాన్ని కొనసాగించాలా అనే అంశంపై తాను ఆలోచిస్తున్నట్లు ట్రంప్ వెల్లడించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ట్రంప్ మాట్లాడుతూ, ఇరాన్పై పెద్ద నిర్ణయం తన ముందుందని, పరిస్థితులను బట్టి ఏదైనా జరగవచ్చని పేర్కొన్నారు. వచ్చే వారం ఐక్యరాజ్యసమితి సర్వసభ్య సమావేశం సందర్భంగా సౌదీ అరేబియా, యూఏఈ, ఖతార్, బహ్రెయిన్, కువైట్, ఒమన్ దేశాల నేతలతో ట్రంప్ సమావేశం కానున్నారు. ఈ చర్చల అనంతరం ఇరాన్పై తదుపరి వ్యూహంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.











