పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఏర్పడిన అంతర్గత విభేదాలు చీలికకు దారితీయడంతో, పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. అసలు పార్టీ పేరు, గుర్తును నిలిపివేసి, రెండు వర్గాలకు తాత్కాలికంగా వేర్వేరు పేర్లు, గుర్తులను కేటాయించింది.
తృణమూల్ కాంగ్రెస్ (టీఎంసీ)లో ఏర్పడిన అంతర్గత విభేదాలు చీలికకు దారితీయడంతో, పార్టీ పేరు, ఎన్నికల గుర్తుపై ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. టీఎంసీకి చెందిన ప్రత్యర్థి వర్గాల మధ్య వివాదం నేపథ్యంలో అసలు పార్టీ పేరు ఆల్ ఇండియా తృణమూల్ కాంగ్రెస్, అలాగే పార్టీకి కేటాయించిన పూలు-గడ్డి గుర్తును ఎన్నికల సంఘం నిలిపివేసింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
జరగనున్న పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఉపఎన్నికలను దృష్టిలో పెట్టుకుని ఈ నిర్ణయం తీసుకున్నారు. నందిగ్రామ్, రేజినగర్ నియోజకవర్గాల్లో టీఎంసీ పేరుతో ఇరు వర్గాలు అభ్యర్థులను బరిలోకి దించడంతో సమస్య ఏర్పడింది. రెండు వర్గాలు ఒకే పార్టీ పేరు, గుర్తును ఉపయోగిస్తే ఓటర్లలో గందరగోళం ఏర్పడే అవకాశం ఉన్నందున ఎన్నికల సంఘం తాత్కాలిక ఏర్పాటు చేసింది.











