కామారెడ్డి, జూలై 18
జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన పలువురు ఎస్హెచ్వోలు, ఎస్సైలను ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ఆదేశించారు. ప్రజలకు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రధాన కర్తవ్యమని, వారి విశ్వాసాన్ని సంపాదించుకోవడమే పోలీసు శాఖకు నిజమైన బలమని ఆయన పేర్కొన్నారు.
ప్రజల విశ్వాసాన్ని నిలబెట్టేలా బాధ్యతాయుతంగా విధులు నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర, ఐపీఎస్ నూతనంగా బాధ్యతలు స్వీకరించిన ఎస్హెచ్వోలు, ఎస్సైలకు సూచించారు.
జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన భిక్కనూర్ ఎస్హెచ్వో అనిల్, రాజంపేట్ ఎస్హెచ్వో ఆంజనేయులు, మాచారెడ్డి ఎస్హెచ్వో విజయ్, బీబీపేట్ ఎస్హెచ్వో నవీన్ చంద్ర, బాన్సువాడ ఎస్ఐ శిరీష శనివారం జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ, ప్రజలకు బాధ్యతాయుతమైన, పారదర్శకమైన పోలీసు సేవలు అందించడమే ప్రతి పోలీసు అధికారి ప్రధాన కర్తవ్యమని సూచించారు. ప్రజల విశ్వాసాన్ని సంపాదించుకోవడమే పోలీసు శాఖకు నిజమైన బలమని పేర్కొన్నారు.
చట్టాన్ని సమానంగా అమలు చేస్తూ, బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి ఫిర్యాదును సున్నితంగా పరిశీలించి సమర్థవంతంగా పరిష్కరించాలని ఆదేశించారు. ప్రజలతో మర్యాదపూర్వకంగా వ్యవహరిస్తూ, పోలీసు శాఖపై మరింత విశ్వాసం పెరిగేలా పనిచేయాలని సూచించారు.












