కామారెడ్డి, 2026-07-23
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద రెడ్డి ఆదేశాల మేరకు, గర్గుల్ గ్రామంలో వన మహోత్సవంలో భాగంగా 2000 ఈత మొక్కలు నాటారు. ఈ కార్యక్రమం గౌడ కులస్తుల వృత్తికి, పర్యావరణానికి మేలు చేస్తుందని ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ తెలిపారు.
కామారెడ్డి జిల్లా ప్రోహిబిషన్ మరియు ఎక్సైజ్ అధికారి శ్రీ ముకుంద రెడ్డి గారి ఆదేశాల మేరకు గురువారం రోజు కామారెడ్డి మండలంలోని గర్గుల్ గ్రామంలో వన మహోత్సవం కార్యక్రమంలో భాగంగా 2000 ఈత మొక్కలు నాటడం జరిగింది.
ఈ సందర్భంగా ఎక్సైజ్ ఎస్ఐ విక్రమ్ కుమార్ గారు మాట్లాడుతూ, ఈత చెట్టు నాటడం వల్ల గౌడ కులస్తులకు కులవృత్తిని అందించడంతో పాటు పర్యావరణానికి కూడా తోడ్పాటు అందించడం జరుగుతుందని తెలిపారు.
అదేవిధంగా కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా ఎక్సైజ్ శాఖ ఆధ్వర్యంలో వివిధ మండలాల్లో ఈత, ఖర్జూర చెట్లు నాటడం జరుగుతుందని ఆయన ఈ సందర్భంగా తెలిపారు.
ఈ కార్యక్రమంలో కామారెడ్డి ఎక్సైజ్ ఎస్సై విక్రమ్ కుమార్, గ్రామ సర్పంచ్ దివ్య, టెక్నికల్ అసిస్టెంట్ సంతోష్, గౌడ సంఘం నుంచి మొగుళ్ళ సాయ గౌడ్, పెద్ద రాజా గౌడ్, మొగుళ్ళ రామా గౌడ్, ఇతర గౌడ సభ్యులు, మరియు సిబ్బంది నరసింహులు, శరత్చంద్ర, దినేష్ కుమార్ పాల్గొన్నారు.












