కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్ల వేతనాలపై సిఫార్సులు చేయనున్న 8వ కేంద్ర వేతన సంఘం చండీగఢ్లో కీలక సమావేశం నిర్వహించింది. ఈ సమావేశంలో ప్రధానంగా 3.25 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలనే డిమాండ్ చర్చకు వచ్చింది. తదుపరి సమావేశం బెంగళూరులో జరగనుంది.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించిన వేతనాలు, పెన్షన్లు, ఇతర ప్రయోజనాలపై సిఫార్సులు చేయనున్న 8వ కేంద్ర వేతన సంఘం తన సంప్రదింపులను కొనసాగిస్తోంది. తాజాగా నుంచి 18 వరకు చండీగఢ్లో మూడు రోజుల పర్యటన నిర్వహించింది. వివిధ ఉద్యోగ, కార్మిక సంఘాలు, సంస్థల ప్రతినిధులతో కమిషన్ సమావేశమైంది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సమావేశాల్లో ప్రధానంగా ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అంశం చర్చకు వచ్చింది. పోస్ట్ గ్రాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ () కు చెందిన నర్సింగ్ ఉద్యోగుల ప్రతినిధులు 3.25 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ అమలు చేయాలని డిమాండ్ చేసినట్లు నివేదికలు పేర్కొన్నాయి. ప్రస్తుతం 7వ వేతన సంఘంలో 2.57 ఫిట్మెంట్ ఫ్యాక్టర్ ఆధారంగా వేతనాలను నిర్ణయించారు.











