ఉత్తరప్రదేశ్లోని చాయల్ నియోజకవర్గ బీజేపీ ఎమ్మెల్యే పూజా పాల్ సైబర్ మోసానికి గురయ్యారు. ఆమె బ్యాంకు ఖాతా నుంచి యూపీఐ, ఫోన్పే ద్వారా పలుమార్లు లావాదేవీలు జరిపి సుమారు రూ.1.55 లక్షలు అనధికారికంగా బదిలీ అయినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ధూమన్గంజ్ పోలీస్ స్టేషన్లో గుర్తుతెలియని వ్యక్తిపై కేసు నమోదైంది.
పోలీసులకు అందిన ఫిర్యాదు వ తేదీన ఎమ్మెల్యే ఖాతా నుంచి పలుమార్లు యూపీఐ లావాదేవీలు జరిగాయి. అయితే ఈ లావాదేవీల గురించి ఆమెకు ముందుగా ఎలాంటి సమాచారం లేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. తన ఖాతా వివరాలను పరిశీలించిన సమయంలో అనధికారిక లావాదేవీలు జరిగిన విషయం బయటపడింది.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఐఫోన్ హ్యాకింగ్ అనుమానం
తన ఐఫోన్లోని వ్యక్తిగత, కీలక సమాచారాన్ని ఎవరో అనధికారికంగా యాక్సెస్ చేసి ఉండొచ్చని పూజా పాల్ పోలీసులకు అనుమానం వ్యక్తం చేశారు. మొబైల్లోకి అనధికార ప్రవేశం జరిగిన తర్వాతే యూపీఐ ద్వారా డబ్బులు బదిలీ చేసి ఉండొచ్చని ఆమె ఫిర్యాదులో పేర్కొన్నట్లు అధికారులు తెలిపారు. ఈ కోణంలోనూ పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.











