పరిశుభ్రత కేవలం ప్రభుత్వ బాధ్యత కాదని, ప్రతి ఒక్కరూ దానిని తమ దైనందిన జీవితంలో భాగంగా చేసుకోవాలని కర్ణాటక గ్రామీణ తాగునీరు, పారిశుద్ధ్య శాఖ కమిషనర్ ఫౌజియా తరన్నుమ్ బి పిలుపునిచ్చారు. జిల్లా శ్రీరంగపట్టణ తాలూకా కే. శెట్టహళ్లి గ్రామ పంచాయతీలో స్వచ్ఛతా హి సేవా2026 రాష్ట్రస్థాయి ప్రత్యేక కార్యక్రమాన్ని ఆమె ప్రారంభించారు.
ప్లాస్టిక్, గాజు, లోహం వంటి పునర్వినియోగ పదార్థాలను ప్రత్యేకంగా వేరు చేసి శాస్త్రీయ పద్ధతిలో నిర్వహించాలని సూచించారు. గ్రామ పంచాయతీల పరిధిలో ఘన వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, ప్లాస్టిక్ వ్యర్థాల నిర్వహణ కేంద్రాలు, మల వ్యర్థాల శుద్ధి సదుపాయాలు, మెటీరియల్ రికవరీ కేంద్రాలను బలోపేతం చేస్తున్నట్లు ఆమె వివరించారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
పారిశుద్ధ్య కార్మికులను గౌరవించి, వారి పనికి ప్రజలు సహకరించాలని ఫౌజియా తరన్నుమ్ కోరారు. మనం సృష్టించే చెత్తను నిర్వహించడం ఇతరుల పని అనే భావనను విడిచిపెట్టి ప్రతి ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు.











