రాజాం పార్టీ కార్యాలయంలో వైయస్ఆర్ సీపీ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి శాసన మండలి విపక్ష నేత, మాజీ మంత్రి శ్రీ బొత్స సత్యనారాయణ గారు ముఖ్య అతిథిగా హాజరై పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. స్థానిక ఎన్నికల్లో ఐక్యంగా పనిచేసి విజయభేరి మోగించాలని నాయకులు సూచించారు.
రాజాం సమన్వయకర్త శ్రీ తలె రాజేష్ గారి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో జిల్లా వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు శ్రీ బెల్లాన చంద్రశేఖర్ గారు, యువ నాయకురాలు శ్రీమతి డాక్టర్ బొత్స అనూష గారు, యువ నాయకులు డాక్టర్ శ్రీ బొత్స సందీప్ గారు కూడా పాల్గొన్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఈ సందర్భంగా బొత్స సత్యనారాయణ గారు మాట్లాడుతూ.. రాజాం ంలోని నాయకులు, కార్యకర్తలు పదవులను కాకుండా పార్టీ విలువలు, సిద్ధాంతాలను చూస్తారని అన్నారు. నాయకులు వస్తుంటారు పోతుంటారని, కానీ పార్టీ కోసం కష్టపడే కార్యకర్తలు ఎప్పటికీ పార్టీకి అండగా ఉంటారని తెలిపారు. పార్టీ నాయకులకు, కార్యకర్తలకు ఐడీ కార్డుల పంపిణీ చేయడం ద్వారా ప్రతి కార్యకర్తకు గుర్తింపు, గౌరవం ఉంటుందని, భవిష్యత్తులో పార్టీ అధికారంలోకి వచ్చినప్పుడు తగిన గుర్తింపు, బాధ్యతలు లభిస్తాయని అన్నారు.











