కామారెడ్డి, 13 September
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీ స్మశాన వాటికలో అంత్యక్రియలు, దినకర్మల రోజు మున్సిపల్ నుండి నీటి ట్యాంకర్లు పంపడం లేదని, దీనివల్ల ప్రైవేట్ ట్యాంకర్లకు వేల రూపాయలు ఖర్చవుతోందని స్థానిక మాజీ కౌన్సిలర్లు ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యంపై వారు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
కామారెడ్డి మున్సిపల్ పరిధిలోని ఇంద్ర నగర్ కాలనీ స్మశాన వాటికలో అంత్యక్రియల రోజు దినకర్మ రోజు మున్సిపల్ నుండి వాటర్ ట్యాంకు పంపించడం లేదని, మృతి చెందిన రోజు దినకర్మ రోజు ప్రైవేట్ వాటర్ ట్యాంకు వెయ్యి రూపాయల చొప్పున రెండు వేల రూపాయలు ఖర్చవుతున్నాయని మున్సిపల్ అధికారులకు ఫోన్ చేస్తే పట్టించుకోవడంలేదని స్థానిక వార్డు కౌన్సిలర్ కు ఫోన్ చేస్తే కూడా పంపడం లేదని మున్సిపల్ అధికారులు ఇప్పటికైనా పట్టించుకోని ఎవరైనా మృతి చెందిన రోజు మున్సిపల్ నుండి వాటర్ ట్యాంకు పంపించాలని, అంత్యక్రియల దినకర్మ రోజు కూడా వాటర్ ట్యాంక్ పంపించాలని అన్నారు. మృతి చెందిన రోజు దినకర్మ బంధువుల ముందు వాటర్ లేక తీవ్ర ఇబ్బందులకు గురి కావడం జరుగుతుందని ముఖ్యంగా మహిళలు ఉంటారు కాబట్టి అది దృష్టిలో పెట్టుకొని కచ్చితంగా మున్సిపల్ నుండి అంత్యక్రియల రోజు దినకర్మ రోజు ఒక వాటర్ ట్యాంక్ మున్సిపల్ నుండి పంపించాలని మాజీ వార్డు కౌన్సిలర్ సంఘీ మోహన్ సంఘీ వేణుగోపాల్ సంఘీ రాజలింగం డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సంఘీ వారి బంధువులు మహిళలు పాల్గొన్నారు.












