కామారెడ్డి, జూలై 24
కామారెడ్డిలోని నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించి, ప్రజల భద్రతను మెరుగుపరిచేందుకు జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రక్రియ ప్రారంభమైంది. ట్రాఫిక్ సీఐ నరహరి, ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో ఈ పనులు జరుగుతున్నాయి.
పట్టణంలోని అత్యంత రద్దీ ప్రాంతమైన నిజాంసాగర్ చౌరస్తాలో ట్రాఫిక్ అంతరాయాలను తగ్గించి, వాహనదారులు మరియు పాదచారుల భద్రతను మెరుగుపరిచే లక్ష్యంతో కామారెడ్డి జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో నూతనంగా డార్క్ ఐ బొల్లార్డ్స్ ఏర్పాటు ప్రక్రియ చేపట్టారు. ట్రాఫిక్ అంతరాయాల నివారణతో పాటు ప్రజల భద్రతకు కామారెడ్డి పోలీసులు ఈ చర్యలు తీసుకుంటున్నారు.
కామారెడ్డి పట్టణ సీఐ నరహరి ఆధ్వర్యంలో, ట్రాఫిక్ ఎస్ఐ చంద్రశేఖర్ గౌడ్ పర్యవేక్షణలో ఈ పనులు కొనసాగుతున్నాయి. రాత్రి వేళల్లో కూడా స్పష్టంగా కనిపించేలా ప్రతిబింబించే డార్క్ ఐ బొల్లార్డ్స్ను ఏర్పాటు చేయడం ద్వారా వాహనదారులకు దారి స్పష్టంగా కనిపించడంతో పాటు ప్రమాదాలను నివారించేందుకు వీలవుతుందని పోలీసులు తెలిపారు.
ఈ ఏర్పాట్లతో చౌరస్తాలో ట్రాఫిక్ క్రమబద్ధీకరణకు, వాహనాల రాకపోకలు సాఫీగా సాగేందుకు, ప్రజల భద్రత మరింత మెరుగుపడేందుకు అవకాశం ఉంటుందని అధికారులు పేర్కొన్నారు.










