రాజంపేట పట్టణంలో అంగన్వాడీ కేంద్రం ఎదురుగా ఉన్న చెత్త డంపింగ్ యార్డును తరలించాలని స్థానికులు, యువత బుధవారం నిరసన చేపట్టారు. ఈ సమస్యపై అధికారులకు పలుమార్లు విజ్ఞప్తి చేసినా చర్యలు తీసుకోలేదని వారు ఆరోపించారు.
అంగన్వాడీ కేంద్రం ముందు పేరుకుపోతున్న చెత్త వల్ల చిన్నారుల ఆరోగ్యం ప్రమాదంలో పడుతోందని, దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని నిరసనకారులు తెలిపారు. ఈ సమస్యను పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
అధికారులు వెంటనే స్పందించి, చెత్త డంపింగ్ యార్డును సురక్షితమైన ప్రదేశానికి తరలించాలని కోరారు. లేదంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని హెచ్చరించారు.












