కామారెడ్డి, 24.07.2026
దేవునిపల్లి పోలీసులు భూమిని అక్రమంగా కబ్జా చేసి, నకిలీ పత్రాలతో రిజిస్ట్రేషన్ చేయించిన కేసులో ముగ్గురిని అరెస్ట్ చేశారు. అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి, తప్పుడు ఆధారాలతో రిజిస్ట్రేషన్ చేయించినట్లు దర్యాప్తులో వెల్లడైంది. కీలక పత్రాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
దేవునిపల్లి పోలీస్ స్టేషన్లో నమోదైన క్రైం నెం.316/2025లో భూమిని అక్రమంగా కబ్జా చేసి, తప్పుడు పత్రాలు సృష్టించి, అసలు యజమాని స్థానంలో వేరే వ్యక్తిని నిలబెట్టి అక్రమ రిజిస్ట్రేషన్ చేయించిన కేసును దేవునిపల్లి పోలీసులు విజయవంతంగా ఛేదించారు.












