బోర్లం (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 12
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. విద్యార్థినులతో కలిసి భోజనం చేసిన అధికారులు, వారికి అందిస్తున్న వసతులు, ఆహార నాణ్యతపై ఆరా తీశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
బాన్సువాడ మండలం బోర్లం గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాలు, జూనియర్ కళాశాల (బాలికల)ను జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్, జిల్లా ఎస్పీ రాజేష్ చంద్ర బుధవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. గురుకులంలో విద్యార్థినులకు అందుతున్న విద్య, వసతులు, భోజనం, పరిశుభ్రత తదితర అంశాలను వారు క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా విద్యార్థినులతో కలిసి మధ్యాహ్న భోజనం చేసిన కలెక్టర్, ఎస్పీ, వారికి అందిస్తున్న ఆహార నాణ్యత, రుచి, మెనూ అమలు, పరిశుభ్రతపై స్వయంగా తెలుసుకున్నారు. భోజనం ఎలా ఉందని విద్యార్థినులను అడిగి వారి అభిప్రాయాలను స్వీకరించారు.












