జంగంపల్లి (డాక్సిన్ టైమ్స్) ఆగస్టు 12
ఇంటర్ పూర్తి చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచేందుకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత లాంగ్ టర్మ్ శిక్షణ అందించనుంది. ఈ నెల 16వ తేదీ వరకు దరఖాస్తులను స్వీకరించనున్నారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
ఇంటర్ పూర్తి చేసిన వెనుకబడిన తరగతుల (బీసీ) విద్యార్థులకు జాతీయ స్థాయి వైద్య, ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షల్లో ప్రతిభ కనబరిచి, ప్రముఖ వైద్య, ఇంజినీరింగ్ విద్యాసంస్థల్లో సీట్లు సాధించేందుకు మహాత్మా జ్యోతిబా పూలే తెలంగాణ వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో ఉచిత లాంగ్టర్మ్ శిక్షణ అందించనున్నట్లు బీసీ గురుకులాల ఉమ్మడి కామారెడ్డి జిల్లా ప్రాంతీయ సమన్వయకర్త సి. రాధికా తెలిపారు. నీట్-యూజీ, జేఈఈ-2027 ప్రవేశ పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులకు ఈ ఉచిత లాంగ్టర్మ్ రెసిడెన్షియల్ శిక్షణను అందిస్తారు. ఇంటర్లో ఉత్తీర్ణులైన, గతంలో నీట్, జేఈఈ పరీక్షల్లో మెరుగైన ప్రతిభ కనబరిచిన విద్యార్థులు ఈ శిక్షణకు అర్హులు.












