కామారెడ్డి, 3 September
స్థానిక ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో ప్రారంభ్ ఉత్సవ్ 2026 పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ ప్రతిభాపాటవాలతో ప్రోగ్రాంను విజయవంతం చేశారు.
తాజా వార్తలు, అప్డేట్స్ అన్నీ మీ దగ్గర!
రోజువారీ వార్తలు మీ ఇన్బాక్స్కి పొందండి
*ఆర్కే విద్యాసంస్థల ఆధ్వర్యంలో ఘనంగా 'ప్రారంభ్ ఉత్సవ్ 2026' ఫ్రెషర్స్ డే వేడుకలు* స్థానిక ఆర్కే, ఎస్ఆర్కే, విఆర్కే జూనియర్, డిగ్రీ, పీజీ కళాశాలల ఆధ్వర్యంలో 'ప్రారంభ్ ఉత్సవ్ 2026' పేరుతో ఫ్రెషర్స్ డే వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూనియర్, డిగ్రీ, పీజీ విద్యార్థులు పెద్ద సంఖ్యలో హాజరై, తమ ప్రతిభాపాటవాలతో ప్రోగ్రాంను ఘనవిజయం చేశారు.రజతోత్సవ వేడుకలకు శ్రీకారం:ఆర్కే విద్యాసంస్థలను స్థాపించి 25 సంవత్సరాలు పూర్తి ఐనసందర్భంగా, ఈ సంవత్సరం రజతోత్సవ వేడుకలకు శ్రీకారం చుట్టామని సంస్థ సీఈఓ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి ఈ సందర్భంగా తెలియజేశారు. గత 24 సంవత్సరాలలో ఇక్కడ చదివిన అనేకమంది విద్యార్థులు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో ఉన్నత స్థానాల్లో స్థిరపడ్డారని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుత విద్యార్థులు కూడా అదే బాటలో పయనించి ఉన్నత శిఖరాలను అధిరోహించాలని వేదికపై ఉన్న అతిథులు ఆకాంక్షించారు.ముఖ్య అతిథులు మరియు ప్రత్యేక ఆహ్వానితులు:ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా అడిషనల్ కలెక్టర్ గిరి గారు పాల్గొని మాట్లాడుతూ... విద్యార్థులు ఉత్తమoగా చదివి Kamareddy జిల్లా కు ఉత్తమ ఫలితాలు సాధించాలని తెలిపారు. అదేవిధంగా ఇంటర్ నోడల్ అధికారి షేక్ సలాం గారు, మై భారత్ జిల్లా యువజన అధికారి (DYO) రమేష్, DYSO వెంకటేశ్వర్ గౌడ్ విచ్చేశారు. ప్రత్యేక ఆహ్వానితులుగా తెలంగాణ యూనివర్సిటీ ప్రొఫెసర్లు ప్రొఫెసర్ అపర్ణ, ప్రొఫెసర్ విద్యావర్ధిని హాజరయ్యారు. వేడుకల్లో 'గెస్ట్ ఆఫ్ హానర్స్'గా ప్రముఖ ప్లేబ్యాక్ సింగర్ సురేష్ బాబు, లిరిక్ రైటర్ ప్రజాకవి జయరాజ్ గారు పాల్గొని ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. కార్యక్రమంలో కళాశాల గ్రూప్ చైర్మన్ భాస్కర్ రావు గారితో పాటు వివిధ విభాగాల ప్రిన్సిపాల్స్, వైస్ ప్రిన్సిపాల్స్, హెచ్ఓడీలు (HODs), సీనియర్ లెక్చరర్లు, అధ్యాపకులు, మరియు సిబ్బంది పెద్ద ఎత్తున పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, సంగీత కార్యక్రమాలతో కళాశాల ప్రాంగణం రోజంతా కోలాహలంగా మారింది.












