కామారెడ్డి, 2026-07-29
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం, మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో అద్భుత ప్రతిభ కనబరిచారు. ఈ నెల 27న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన పోటీల్లో పాల్గొని పలు విభాగాల్లో బంగారు, వెండి, కాంస్య పతకాలు సాధించారు.
కామారెడ్డి జిల్లా సదాశివ నగర్ మండలం, మర్కల్ గ్రామంలోని తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థినులు జిల్లాస్థాయి అథ్లెటిక్ పోటీల్లో సత్తా చాటారు. ఈ నెల 27న కామారెడ్డి జిల్లా కేంద్రంలోని ఇందిరాగాంధీ స్టేడియంలో జరిగిన జిల్లాస్థాయి అథ్లెటిక్స్ ఎంపిక పోటీల్లో వీరు పాల్గొన్నారు.
జావెలిన్ త్రో మహిళల విభాగంలో ఎం. అమృత గోల్డ్ మెడల్, అండర్-20 విభాగంలో బి. నవ్య గోల్డ్ మెడల్, అండర్-18 విభాగంలో కే. స్వప్న సిల్వర్ మెడల్, ఎం. మహేశ్వరి బ్రాంజ్ మెడల్ సాధించారు.
ఈ సందర్భంగా కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ సి. శోభారాణి, వైస్ ప్రిన్సిపాల్ ఎస్. కృష్ణవేణి, ఫిజికల్ డైరెక్టర్ రమాదేవి, అధ్యాపక బృందం విద్యార్థినులను అభినందించారు.











